thumbnail

By

Published : Apr 3, 2023, 3:53 PM IST

ETV Bharat / Videos

థియేటర్​లో టికెట్లు అమ్మిన రవితేజ హీరోయిన్లు.. ఎగబడ్డ కుర్రాళ్లు!

టాలీవుడ్​ మాస్​ మహారాజా రవితేజ.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది రిలీజైన ధమాకా సినిమాతో విజయం అందుకున్న ఆయన.. మరో మూడు రోజుల్లో రావణాసుర చిత్రంతో థియేటర్లలోకి రానున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రంలో నటించిన కథానాయికలు దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హైదరాబాద్​లోని ఏఎంబీ మాల్​లో సందడి చేశారు. యంగ్​ హీరో సుశాంత్​తో కలిసి సినిమా టికెట్లను విక్రయించారు. టికెట్ కౌంటర్​లో కూర్చొని ప్రేక్షకులతో మాట్లాడుతూ టికెట్లను అందజేశారు. అయితే సుశాంత్, దక్ష, పూజిత రావడంతో వారిని చూసేందుకు పలువురు ప్రేక్షకులు పోటీపడ్డారు. బ్యూటీల చేతుల మీదుగా రావణాసుర టికెట్లు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా చిత్రం తర్వాత.. మెగాస్టార్​ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో కూడా నటించారు. అందులో రవితేజ తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.