వైరల్ వీడియో: యువకుల పైశాచికం.. గజరాజులపై దాడి - ఏనుగులపై రాళ్లు రువ్విన యువకులు
🎬 Watch Now: Feature Video

తమిళనాడు తిరుప్పూర్ జిల్లా తిరుమూర్తి కొండల్లోని పశ్చిమ కనుమల్లో.. అమరలింగేశ్వర ఆలయం ఉంది. ఆ ప్రాంతంలో నివాసముండే గిరిజన యువకులు కొందరు.. అక్కడ ఆహారం కోసం సంచరించే ఏనుగలను తీవ్రంగా హింసించారు. పెద్ద పెద్ద రాళ్లు రువ్వుతూ.. వాటిపై దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా.. పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Last Updated : May 6, 2021, 4:56 PM IST