thumbnail

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చైన్​ స్నాచింగ్

By

Published : Aug 20, 2019, 12:52 PM IST

Updated : Sep 27, 2019, 3:40 PM IST

గొలుసు దొంగలు మళ్లీ పడగ విప్పుతున్నారు. కర్ణాటక రాయ​చూర్​లోని సదర్​ బజార్​లో ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. జనాలు బాగానే సంచరిస్తున్నారు. అయినా.. ఆ దొంగలకు అడ్డేమీ అనిపించలేదు. పక్కా స్కెచ్​ వేసి.. కాచుకొని ఉన్నారు. ఒక్కసారిగా బైక్​పై దూసుకెళ్లి.. లలిత అనే గృహిణి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. షాక్​కు గురైన మహిళ కిందపడింది. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి కేసు నమోదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.
Last Updated : Sep 27, 2019, 3:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.