దైవచింతనలో మోదీ.. ఆదిశంకరాచార్యుల విగ్రహం ముందు ధ్యానం - మోదీ కేదార్నాథ్ పర్యటన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13550877-thumbnail-3x2-modi-kedarnath.jpg)
ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఆధ్మాత్మిక చింతనలో గడిపారు. తొలుత కేదార్నాథ్ ఆలయంలో పూజలు చేసిన ప్రధాని.. అనంతరం ఆది శంకరాచార్య సమాధి స్థల్ను ప్రారంభించారు. అక్కడే 2019లో చేపట్టిన 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువుగల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదిగురువు ముందు కూర్చొని మోదీ కొద్దిసేపు ధ్యానం కూడా చేశారు. 2013లో వరదల కారణంగా.. అప్పటి సమాధి ధ్వంసమైంది. దీంతో 2019లో ఈ సమాధి పునర్నిర్మాణంతో పాటు.. విగ్రహ నిర్మాణాన్ని ప్రారంభించారు.