వేడి నూనె నుంచి వడలు చేతితో తీసి.. నైవేద్యం
కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని(Karnataka Uttara Kannada News) కామాక్షీ దేవి ఆలయంలో.. వినూత్న సంప్రదాయం అమలులో ఉంది. కుమట పట్టణంలోని ఈ దేవాలయంలో ఏటా 15రోజుల పాటు ఘనంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా... చివరి రోజున అమ్మవారికి వడలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితి. అయితే.. సలసల కాగుతున్న నూనెలో నుంచి భక్తులు స్వయంగా వారి చేతులతో వడలను తీసి, కామాక్షీ దేవికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. నూనెలో నుంచి వడలను తీసి అమ్మవారికి సమర్పించేందుకు భక్తులు బారులు తీరుతున్నారు