కుందేలుకు చెవులు కుట్టించారు.. ఎందుకంటే?
సంక్రాంతి పండుగ సందర్భంగా.. అడవి కుందేలుకు చెవులు కుట్టించిన ఘటన కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని కాంచీపురంలో జరిగింది. ఏటా సంక్రాంతి సందర్భంగా అడవికి వెళ్లి.. కుందేలును తీసుకొచ్చి బంగారంతో చెవులు కుట్టించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కుందేలును కాంచీపురం ప్రధాన వీధుల గుండా ఊరేగించిన గ్రామస్థులు.. వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక ఆరాధన చేశారు. ఇలా చేయడం ద్వారా వర్షాలు పుష్కలంగా పడి పంటలు సమృద్ధిగా పండుతాయని స్థానికుల నమ్మకం.