అగ్నికీలల మధ్య 'ప్లాస్టిక్ ఇండియా' భవనం
గుజరాత్లోని కచ్ జిల్లా భాచౌ-గాధిధమ్ జాతీయ రహదారిపై ఉన్న 'ప్లాస్టిక్ ఇండియా' అనే ప్రైవేటు వ్యాపార సంస్థ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. దావానలం ధాటికి భవనం పూర్తిగా దగ్ధమయ్యింది. ఎగిసిపడుతున్న మంటలు చూసి ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది.