thumbnail

By

Published : Mar 11, 2021, 9:52 PM IST

ETV Bharat / Videos

'మమతపై దాడి' సీసీటీవీ ఫుటేజ్ విడుదల!

బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన నందిగ్రామ్​ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. కారు వద్ద జనం గుమిగూడినట్లు వీడియోలో కనిపిస్తోంది. బుధవారం నందిగ్రామ్​ పర్యటనలో భాగంగా తన కారు డోరు వద్ద నిలబడగా కొందరు వ్యక్తులు తోసేయవడం వల్లే ఈ ఘటన జరిగిందని దీదీ ఆరోపించారు. ఇది కుట్రపూరిత వ్యూహమే అని టీఎంసీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. దీన్ని భాజపా తోసిపుచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.