thumbnail

సావన్​ మాసం ఆరంభం- శైవ క్షేత్రాలు కిటకిట

By

Published : Jul 22, 2019, 11:18 AM IST

సావన్​ మాసం తొలి సోమవారం సందర్భంగా ఉత్తరభారతంలోని శైవ క్షేత్రాలు కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు శివుడిని దర్శించుకుంటున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో ఘాట్​లన్నీ కళకళలాడుతున్నాయి. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కొంత మంది కన్వారాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​ల చిత్రాలు ముద్రించి ఉన్న టీ షర్టులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగీ పాలన సంతృప్తికరంగా ఉన్నందునే ఈ విధంగా చేసినట్టు వివరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.