thumbnail

'గో సంరక్షణ' పేరుతో మరో మూకదాడి

By

Published : Jul 8, 2019, 11:08 AM IST

మధ్యప్రదేశ్​ ఖండ్వా జిల్లాలోని ఖాల్​వాలో గోవులను తరలిస్తున్నారన్న ఆరోపణలతో 25 మందిని బంధించి వారిపై దాడి చేశారు గ్రామస్థులు. 8 వాహనాల్లో ఆవులను తరలిస్తూ స్థానికుల చేతికి చిక్కిన ముఠాను తాళ్లతో బంధించి 'గోమాతకు జై' నినాదాలు పలికించారు. అలాగే ప్రదర్శనగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. గోవులను తరలించేవారితోపాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, దాడి చేసిన కారణంగా గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.