ETV Bharat / state

ఆ సంబంధమే హత్యకు కారణం - latest crime news in telangana

ఆమెకు పెళ్లై పన్నెండేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలూ ఉన్నారు. ఎందుకో ఏమో భర్తతో విడిపోయింది. 6 సంవత్సరాలుగా తాపీ మెస్త్రీతో వివాహేతర సంబంధం కొనసాగించింది. చివరికి అతడి చేతిలోనే హత్యకు గురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో ఈ దారుణం జరిగింది.

rachakonda police find out accused in murder case in cjouttuppal
ఆ సంబంధమే హత్యకు కారణం
author img

By

Published : Mar 11, 2020, 8:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావికి చెందిన జయసుధకు మల్కాపురానికి చెందిన మీసాల శేఖర్ తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు. జయసుధ ఎల్లంబావిలో నివాసం ఉంటూ 6 సంవత్సరాలుగా ఉదరి రమేశ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది.

ఆ సంబంధమే హత్యకు కారణం

రమేశ్​కు 2 సంవత్సరాల క్రితం వివాహం కాగా 3 నెలల నుంచి జయసుధ వద్దకు వెళ్లడం లేదు. జయసుధ తరుచుగా రమేశ్​కు ఫోన్​ చేస్తూ ఉండేది. ఓ రోజు జయసుధ నివసిస్తున్న ఇంటిపక్కన రమేశ్​ తాపీ మేస్త్రీ పనికి వెళ్లగా అక్కడ ఇద్దరికి గొడవ జరిగింది. మరుసటి రోజు ఎవరు లేని సమయంలో మద్యం సేవించిన రమేశ్..​ జయసుధ ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కాడు.

ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావికి చెందిన జయసుధకు మల్కాపురానికి చెందిన మీసాల శేఖర్ తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు. జయసుధ ఎల్లంబావిలో నివాసం ఉంటూ 6 సంవత్సరాలుగా ఉదరి రమేశ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది.

ఆ సంబంధమే హత్యకు కారణం

రమేశ్​కు 2 సంవత్సరాల క్రితం వివాహం కాగా 3 నెలల నుంచి జయసుధ వద్దకు వెళ్లడం లేదు. జయసుధ తరుచుగా రమేశ్​కు ఫోన్​ చేస్తూ ఉండేది. ఓ రోజు జయసుధ నివసిస్తున్న ఇంటిపక్కన రమేశ్​ తాపీ మేస్త్రీ పనికి వెళ్లగా అక్కడ ఇద్దరికి గొడవ జరిగింది. మరుసటి రోజు ఎవరు లేని సమయంలో మద్యం సేవించిన రమేశ్..​ జయసుధ ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కాడు.

ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.