యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావికి చెందిన జయసుధకు మల్కాపురానికి చెందిన మీసాల శేఖర్ తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు. జయసుధ ఎల్లంబావిలో నివాసం ఉంటూ 6 సంవత్సరాలుగా ఉదరి రమేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది.
రమేశ్కు 2 సంవత్సరాల క్రితం వివాహం కాగా 3 నెలల నుంచి జయసుధ వద్దకు వెళ్లడం లేదు. జయసుధ తరుచుగా రమేశ్కు ఫోన్ చేస్తూ ఉండేది. ఓ రోజు జయసుధ నివసిస్తున్న ఇంటిపక్కన రమేశ్ తాపీ మేస్త్రీ పనికి వెళ్లగా అక్కడ ఇద్దరికి గొడవ జరిగింది. మరుసటి రోజు ఎవరు లేని సమయంలో మద్యం సేవించిన రమేశ్.. జయసుధ ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కాడు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస