ETV Bharat / state

మహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు - యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గత మూడురోజుల నుంచి జరుగుతున్న పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. మహా పూర్ణాహుతితో శాస్త్రోత్సంగా పవిత్రోత్సవాలను ముగించారు ఆలయ అర్చకులు.

pavithrothsavalu completed in yadadri laxmi narasimha swamy temple
మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
author img

By

Published : Jul 31, 2020, 4:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. ఈనెల 29న ప్రారంభమైన ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. చివరి రోజైన నేడు పవిత్రముల ధారణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలను శాస్త్రోత్సంగా ముగించారు.

తెలిసీ తెలియక ఏడాది నుంచి చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. ఈనెల 29న ప్రారంభమైన ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. చివరి రోజైన నేడు పవిత్రముల ధారణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలను శాస్త్రోత్సంగా ముగించారు.

తెలిసీ తెలియక ఏడాది నుంచి చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు.

ఇవీ చూడం ఇవీ చూడండి: ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.