ETV Bharat / state

పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ - moderators secretly selling ration groceries which had given to poor people by government

నిరుపేదలకు అందించాల్సిన రేషన్​ సరుకులు, బియ్యం, కిరోసిన్​ను డబ్బులకు కక్కుర్తి పడు డీలర్లు రాత్రివేళల్లో యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వెలుగు చూసిన ఘటనే దీనికి ఉదాహరణ.

moderators secretly selling ration groceries which had given to poor people by government
author img

By

Published : Jul 15, 2019, 10:01 AM IST

పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఓ రేషన్​ డీలర్​.. షాపు నుంచి 200 లీటర్ల కిరోసిన్​ను అపరిచిత వ్యక్తికి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. డీలర్​ స్థానికంగా ఉండకపోవడం వల్ల మధ్యవర్తి ద్వారా సరుకులు అందిస్తున్నారని, వారేమో తమకు సరిగా ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. నలుగురు డీలర్లకు సంబంధించి ఒకే మధ్యవర్తి ఉండటం, లబ్ధిదారుల బయోమెట్రిక్​ తీసుకోకుండా మాన్యువల్​గా రికార్డులో రాసి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిత్యం ఇలా అక్రమంగా చౌకధరల వస్తువులు తరలుతున్నా... అధికారులు ఎటుంటి చర్యలు తీసుకోవడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు రేషన్​ సరుకులు అందకుండా అక్రమార్కుల కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఓ రేషన్​ డీలర్​.. షాపు నుంచి 200 లీటర్ల కిరోసిన్​ను అపరిచిత వ్యక్తికి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. డీలర్​ స్థానికంగా ఉండకపోవడం వల్ల మధ్యవర్తి ద్వారా సరుకులు అందిస్తున్నారని, వారేమో తమకు సరిగా ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. నలుగురు డీలర్లకు సంబంధించి ఒకే మధ్యవర్తి ఉండటం, లబ్ధిదారుల బయోమెట్రిక్​ తీసుకోకుండా మాన్యువల్​గా రికార్డులో రాసి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిత్యం ఇలా అక్రమంగా చౌకధరల వస్తువులు తరలుతున్నా... అధికారులు ఎటుంటి చర్యలు తీసుకోవడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు రేషన్​ సరుకులు అందకుండా అక్రమార్కుల కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

yadadri
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.