ప్రజా సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతోందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
తెరాస ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదివి.... జీవితంలో పైకి రావాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినా గ్రామాల అభివృద్ధికే ఖర్చు పెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు