ETV Bharat / state

ఫాస్టాగ్ విధానం... గూడూరు టోల్​ ప్లాజాలో భారీగా వాహనాల రద్దీ - FASTTAG

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజాలో నేటి నుంచే ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఫలితంగా టోల్ ప్లాజాలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పరిస్థితిని టోల్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

రద్దీతో భారీగా వాహనాలు జామ్... తీవ్ర అసౌకర్యం
రద్దీతో భారీగా వాహనాలు జామ్... తీవ్ర అసౌకర్యం
author img

By

Published : Dec 15, 2019, 7:33 PM IST

ఫాస్టాగ్ విధానం టోల్ ప్లాజాల వద్ద నేటి నుంచే అమల్లోకి వచ్చింది. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం 12 టోల్ గేట్లు ఉండగా హైదరాబాద్ వైపు రెండు, వరంగల్ వైపు రెండు ఫాస్టాగ్ వాహనాల కోసం కేటాయించారు.
మిగిలిన లైన్లు నగదు చెల్లించి వెలుపలికి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. రానున్న రోజుల్లో నగదు ఒక్క దారి గుండానే చెల్లించి వెలుపలికి వెళ్ళేలా, మిగిలినవన్నీ ఫాస్టాగ్ కోసం కేటాయిస్తామని సిబ్బంది పేర్కొన్నారు.

'నగదు చెల్లింపు దారిలో భారీగా బారులు తీరిన వాహనాలు'

ఫాస్టాగ్ తీసుకున్న వాహనదారులు సాఫీగానే టోల్ ప్లాజాను దాటగలుగుతున్నారు. ఫాస్టాగ్ తీసుకోని వాహనదారుల కోసం టోల్ ప్లాజాల వద్ద పరిమిత సంఖ్యలో దారులు కేటాయించారు. నగదు చెల్లించి వెళ్లాల్సిన ఆ దారుల గుండా వాహనాలు భారీగా బారులు తీరాయి. ఫలితంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫాస్టాగ్ తీసుకోని వారికోసం పరిమిత సంఖ్యలో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లైన్లు కేటాయించారు. అయినప్పటికీ వాహనాల వరుస అధికంగా ఉండటం వల్ల చేసేదిలేక అదనపు టోల్​ను చెల్లించి వెళ్తున్నారు.

వాహన దారుల కోసం ఫాస్టాగ్ వేయటం కోసం టోల్ ప్లాజా పక్కన ప్రత్యేక కౌంటర్​ని ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆదివారం కావడం వల్ల యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గూడూరు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ విధానంతో భారీ సంఖ్యలో వాహన రద్దీ కొనసాగుతోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టోల్ ప్లాజా సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

రద్దీతో భారీగా వాహనాలు జామ్... తీవ్ర అసౌకర్యం
ఇవీ చూడండి : ఫాస్టాగ్​తో టోల్​ చెల్లింపులే కాదు.. నేరగాళ్లనూ పట్టుకోవచ్చు!

ఫాస్టాగ్ విధానం టోల్ ప్లాజాల వద్ద నేటి నుంచే అమల్లోకి వచ్చింది. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం 12 టోల్ గేట్లు ఉండగా హైదరాబాద్ వైపు రెండు, వరంగల్ వైపు రెండు ఫాస్టాగ్ వాహనాల కోసం కేటాయించారు.
మిగిలిన లైన్లు నగదు చెల్లించి వెలుపలికి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. రానున్న రోజుల్లో నగదు ఒక్క దారి గుండానే చెల్లించి వెలుపలికి వెళ్ళేలా, మిగిలినవన్నీ ఫాస్టాగ్ కోసం కేటాయిస్తామని సిబ్బంది పేర్కొన్నారు.

'నగదు చెల్లింపు దారిలో భారీగా బారులు తీరిన వాహనాలు'

ఫాస్టాగ్ తీసుకున్న వాహనదారులు సాఫీగానే టోల్ ప్లాజాను దాటగలుగుతున్నారు. ఫాస్టాగ్ తీసుకోని వాహనదారుల కోసం టోల్ ప్లాజాల వద్ద పరిమిత సంఖ్యలో దారులు కేటాయించారు. నగదు చెల్లించి వెళ్లాల్సిన ఆ దారుల గుండా వాహనాలు భారీగా బారులు తీరాయి. ఫలితంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫాస్టాగ్ తీసుకోని వారికోసం పరిమిత సంఖ్యలో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లైన్లు కేటాయించారు. అయినప్పటికీ వాహనాల వరుస అధికంగా ఉండటం వల్ల చేసేదిలేక అదనపు టోల్​ను చెల్లించి వెళ్తున్నారు.

వాహన దారుల కోసం ఫాస్టాగ్ వేయటం కోసం టోల్ ప్లాజా పక్కన ప్రత్యేక కౌంటర్​ని ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆదివారం కావడం వల్ల యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గూడూరు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ విధానంతో భారీ సంఖ్యలో వాహన రద్దీ కొనసాగుతోంది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టోల్ ప్లాజా సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

రద్దీతో భారీగా వాహనాలు జామ్... తీవ్ర అసౌకర్యం
ఇవీ చూడండి : ఫాస్టాగ్​తో టోల్​ చెల్లింపులే కాదు.. నేరగాళ్లనూ పట్టుకోవచ్చు!
TG_NLG_61_15_FASTTAG_AV_TS10061 రిపోర్టర్ : సతీష్ శ్రీపాద సెంటర్ : భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి సెల్ : 8096621425 యాంకర్ : నేటి నుండి ఫాస్ట్ ట్యాగ్ విధానం టోల్ ప్లాజాల వద్ద అమలులోకి రావటం తో యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం 12 టోల్ గేట్ లు ఉండగా హైదరాబాద్ వైపు రెండు, వరంగల్ వైపు 2రెండు ఫాస్ట్ ట్యాగ్ వాహనాల కోసం కేటాయించారు. మిగిలిన లేన్లు నగదు చెల్లించి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. రానున్న రోజుల్లో ఒక్క దారి గుండానే కేవలం నగదు చెల్లించి వెళ్ళేలా, మిగిలినవన్నీ గేట్ ల గుండా ఫాస్ట్ ట్యాగ్ కోసం కేటాయిస్తామని టోల్ ప్లాజా సిబ్బంది పేర్కొన్నారు. ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న వాహనదారులు సాఫీగానే టోల్ ప్లాజా ను దాటగలుగుతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ తీసుకోని వాహనదారుల కోసం టోల్ ప్లాజాల వద్ద పరిమిత సంఖ్యలో దారులు కేటాయించారు. నగదు చెల్లించి వెళ్లాల్సిన ఆ దారుల గుండా భారీ గా వాహనాలు నిల్చున్నాయి. నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ఫాస్ట్ ట్యాగ్ తీసుకోని వారికోసం పరిమిత సంఖ్యలో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లు కేటాయించినప్పటికి, వాహనాల వరుస అధికంగా ఉండటం తో చేసేదిలేక అదనపు టోల్ ను చెల్లించి వెళ్తున్నారు. వాహన దారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వేయటం కోసం టోల్ ప్లాజా పక్కన కౌంటర్ ని ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆదివారం కావడంతో యాదాద్రి పుణ్యక్షేత్రంకి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గూడూరు టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ విధానం ఈరోజు నుంచి అమలు అవుతుండడంతో వాహనాలు టోల్ ప్లాజా వద్ద భారీ సంఖ్యలో బారులు తీరాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం తో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబం తో వెళ్తున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. టోల్ ప్లాజా సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

FASTTAG
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.