ETV Bharat / state

వేతనాలు పెంచాలని.. ఆశా వర్కర్ల ఆందోళన

author img

By

Published : Jun 15, 2020, 8:45 PM IST

కరోనా విజృంభిస్తున్నా.. ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో అహర్నిశలు కష్టపడుతున్న ఆశా కార్యకర్తలకు ఇన్సెంటివ్స్​ అందించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

Aasha Workers Protest At Yadadri Bhuvanagiri Collectorate
వేతనాలు పెంచాలని.. ఆశా వర్కర్ల ఆందోళన!

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. వేతనాలు రూ.10,000లకు పెంచాలని, ఇన్సెంటివ్స్​ రూ. 5000 అందించాలని డిమాండ్​ చేస్తూ.. కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు లలిత పాల్గొన్నారు.

ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో కూడా ఆశా వర్కర్లు సేవలందిస్తున్నారని, కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్​ కలెక్టర్​ రమేష్​కు వినతి పత్రం సమర్పించి తన ఇబ్బందులు చెప్పుకొన్నారు. రాత్రనకా, పగలనకా పనిచేస్తున్న ఆశా వర్కర్లను నిర్లక్ష్యం చేయొద్దని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల పట్ల సానుకూలంగా స్పందించాలని ఆశా వర్కర్ల యూనియన్​ జిల్లా అధ్యక్షురాలు లలిత డిమాండ్​ చేశారు.

క్వారంటైన్​లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులకు తెలిపే.. ఆశా వర్కర్ల శ్రమకు తగ్గ ఫలితం అందించాలని కోరారు. వేతనాలు తక్కువగా ఉండటం వల్ల మాస్క్​లు, గ్లౌజ్​లు, శానిటైజర్లు కొనుక్కోలేకపోతున్నామని.. ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : కరీంనగర్​ కమిషనరేట్​లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. వేతనాలు రూ.10,000లకు పెంచాలని, ఇన్సెంటివ్స్​ రూ. 5000 అందించాలని డిమాండ్​ చేస్తూ.. కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు లలిత పాల్గొన్నారు.

ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో కూడా ఆశా వర్కర్లు సేవలందిస్తున్నారని, కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్​ కలెక్టర్​ రమేష్​కు వినతి పత్రం సమర్పించి తన ఇబ్బందులు చెప్పుకొన్నారు. రాత్రనకా, పగలనకా పనిచేస్తున్న ఆశా వర్కర్లను నిర్లక్ష్యం చేయొద్దని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల పట్ల సానుకూలంగా స్పందించాలని ఆశా వర్కర్ల యూనియన్​ జిల్లా అధ్యక్షురాలు లలిత డిమాండ్​ చేశారు.

క్వారంటైన్​లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులకు తెలిపే.. ఆశా వర్కర్ల శ్రమకు తగ్గ ఫలితం అందించాలని కోరారు. వేతనాలు తక్కువగా ఉండటం వల్ల మాస్క్​లు, గ్లౌజ్​లు, శానిటైజర్లు కొనుక్కోలేకపోతున్నామని.. ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : కరీంనగర్​ కమిషనరేట్​లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.