ETV Bharat / state

లింగోజిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

author img

By

Published : May 11, 2020, 12:05 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పురపాలిక పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

లింగోజిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
లింగోజిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లింగోజిగూడెం స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న కూడికల వెంకన్నను డీసీఎం ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దివిస్ కంపెనీలో లేబర్​గా పని చేస్తున్న మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామానికి చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లింగోజిగూడెం స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న కూడికల వెంకన్నను డీసీఎం ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దివిస్ కంపెనీలో లేబర్​గా పని చేస్తున్న మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామానికి చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.