కన్నతల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. 2నెలల మగబిడ్డకు అమ్మప్రేమను దూరం చేసింది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఆమె.. కడుపున పుట్టిన బిడ్డ గురించి ఆలోచించకపోవటంతో తల్లి ఆలనాపాలనకు ఆ చిన్నారి దూరమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట చోల్లేరు గ్రామానికి చెందిన పూజశ్రీ(25) ఆత్మహత్యకు యత్నించి మంగళవారం అత్తింటి వద్ద మరణించింది. కాగా ఆమెకు 2 నెలల మగబిడ్డ ఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఆ బిడ్డకు న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. భార్యాభర్తల మధ్య కలహాలతో వారి ఆలనాపాలనకు దూరమైన ఆ పసికందును చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు. గుక్కపట్టి ఏడుస్తున్న మనవడి ధీనస్థితిని అమ్మమ్మ సునీత చూడలేక, ఏమి చేయాలో తోచక.. పాలపీకా నోట్లో పెట్టి ఆ చిన్నారిని నిద్రపుచ్చడానికి యత్నిస్తోంది. ఈ దృశ్యం స్థానికులను కలచివేసింది.
ఇదీ చదవండి: కుటుంబ కలహాలతో నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య