ETV Bharat / state

గుంపుగా ఉన్న ఐదుగురిపై కేసు నమోదు - CORONA UPDATES

అసలే లాక్​డౌన్​ నియమాలు పాటించలేదు... అక్కడితో ఆగకుండా గుంపులుగా ఉండొద్దని చెప్పిన పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఇంకేముంది గొడవపెట్టిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలంలో చోటుచేసుకుంది.

5 MEMBERS ARRESTED FOR LOCK DOWN RULES VIOLATION
గుంపుగా ఉన్న ఐదుగురిపై కేసు నమోదు
author img

By

Published : Apr 30, 2020, 4:18 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో లాక్​డౌన్​ నిబంధనలు అధిగమించినందుకు గానూ... ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని చెరువులో చేపలు పడుతూ... గుంపులుగుంపులుగా వుంటున్నారన్న సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ ఉన్నవారిని పంపించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగారు. దురుసుగా ప్రవర్తించి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఎస్సై రాజు కాలుకు గాయమైంది. ఇక చేసేదేమీ లేకు పోలీసులు... ఆ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండొద్దని సీఐ సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో లాక్​డౌన్​ నిబంధనలు అధిగమించినందుకు గానూ... ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని చెరువులో చేపలు పడుతూ... గుంపులుగుంపులుగా వుంటున్నారన్న సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ ఉన్నవారిని పంపించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగారు. దురుసుగా ప్రవర్తించి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఎస్సై రాజు కాలుకు గాయమైంది. ఇక చేసేదేమీ లేకు పోలీసులు... ఆ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండొద్దని సీఐ సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.