ETV Bharat / state

'బాలికపై అత్యాచారం చేసిన 139 మందిని కఠినంగా శిక్షించాలి' - 139 should be severely punished for raping girl'

గిరిజన బాలికపై 139 మంది అత్యాచారం చేసిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్​ చేసింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

139 should be severely punished for raping girl'
'బాలికపై అత్యాచారం చేసిన 139 మందిని కఠినంగా శిక్షించాలి'
author img

By

Published : Aug 29, 2020, 9:11 AM IST

గిరిజన బాలికపై 139 మంది అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్​ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్​లో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో నమోదైన ఈ కేసులో ఉన్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని కమిటీ సభ్యులు డిమాండ్​ చేశారు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. దళిత బాలికకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు అంగడి నాగరాజు, జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్, దళిత గిరిజన ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామ చంద్రయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.