ETV Bharat / state

మేయర్​ ఎదుట బోరుమన్న వరంగల్​ వరద బాధితులు

author img

By

Published : Aug 22, 2020, 5:19 PM IST

వరంగల్​లో కొంతమంది వరద బాధితులు తమ గోడును మేయర్​ ప్రకాష్​రావు ముందు వెళ్లబోసుకున్నారు. వర్షాలకు ఇళ్లతో సహా బియ్యం, సామగ్రి నీటిలో కొట్టుకుపోయాయని బాధితులు బోరుమన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని... తాము అండగా ఉంటామని మేయర్​ వారికి భరోసా కల్పించారు.

Warangal flood victims shed tears in front of the mayor prakash rao
మేయర్​ ఎదుట బోరుమన్న వరంగల్​ వరద బాధితులు

కూడు గూడు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ వరంగల్ మేయర్ ప్రకాష్​రావు ముందు వరద బాధితులు బోరుమన్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు ఇళ్లతో సహా బియ్యం, సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయాయని బాధితులు మేయర్ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వర్షాలకు వరద నీటితో అతలాకుతలమైన భగత్​సింగ్ వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న వరద బాధితులు తమ కష్టాలను చెప్పుకున్నారు. వరద నీటితో అన్ని కోల్పోపోయామని, తమను ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. అధైర్య పడకండని, వరద బాధితులకు అండగా ఉంటామని వరంగల్ మేయర్ ప్రకాష్​రావు భరోసా కల్పించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.

కూడు గూడు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ వరంగల్ మేయర్ ప్రకాష్​రావు ముందు వరద బాధితులు బోరుమన్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు ఇళ్లతో సహా బియ్యం, సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయాయని బాధితులు మేయర్ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వర్షాలకు వరద నీటితో అతలాకుతలమైన భగత్​సింగ్ వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న వరద బాధితులు తమ కష్టాలను చెప్పుకున్నారు. వరద నీటితో అన్ని కోల్పోపోయామని, తమను ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. అధైర్య పడకండని, వరద బాధితులకు అండగా ఉంటామని వరంగల్ మేయర్ ప్రకాష్​రావు భరోసా కల్పించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.


ఇవీ చూడండి: నిజామాబాద్ పాలనాధికారిని అప్రమత్తం చేసిన నాందేడ్​ కలెక్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.