ETV Bharat / state

కరోనా పాజిటివ్​తో అధికార యంత్రాంగం అప్రమత్తం

author img

By

Published : Apr 4, 2020, 5:15 AM IST

మర్కజ్​ ప్రార్థనకు వెళ్లిన వారికి కరోనా పాజిటివ్​ రావటం వల్ల వరంగల్​ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్​ వచ్చిన 17 మంది నివాసముండే కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్​ రసాయనాన్ని పిచికారి చేశారు. బాధితుల కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్​కు తరలించాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.

warangal cp ravinder visit charbowli
కరోనా పాజిటివ్​తో అధికార యంత్రాంగం అప్రమత్తం

దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన వారికి పాజిటివ్ రిపోర్ట్ రావటంతో వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని నిజాంపూర్, మండి బజార్. చార్​బౌలీకి చెందిన నగరవాసులు ఇటీవల దిల్లీకి ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వారిని గుర్తించి వైద్య ఆరోగ్యశాఖ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి నమూనాలను హైదరాబాద్ పంపించారు.

17 మంది నమూనాల్లో వైరస్​ పాజిటివ్ రిపోర్ట్ రావడం జిల్లా పోలీస్ కమిషనర్ రవీందర్​తో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి మర్కజ్​ వెళ్లి వచ్చిన వారి కాలనీలను సందర్శించి హుటాహుటిన సోడియం హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారి చేయించారు. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితంగా మెదిలిన వ్యక్తులను కూడా క్వారంటైన్​కు తరలించాలని అధికారులను ఆదేశించారు.

కరోనా పాజిటివ్​తో అధికార యంత్రాంగం అప్రమత్తం

ఇవీ చూడండి: మోదీ పిలుపులో భాగమవుదాం... దీపాలు వెలిగిద్దాం: సీఎం

దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన వారికి పాజిటివ్ రిపోర్ట్ రావటంతో వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలోని నిజాంపూర్, మండి బజార్. చార్​బౌలీకి చెందిన నగరవాసులు ఇటీవల దిల్లీకి ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వారిని గుర్తించి వైద్య ఆరోగ్యశాఖ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి నమూనాలను హైదరాబాద్ పంపించారు.

17 మంది నమూనాల్లో వైరస్​ పాజిటివ్ రిపోర్ట్ రావడం జిల్లా పోలీస్ కమిషనర్ రవీందర్​తో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి మర్కజ్​ వెళ్లి వచ్చిన వారి కాలనీలను సందర్శించి హుటాహుటిన సోడియం హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారి చేయించారు. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితంగా మెదిలిన వ్యక్తులను కూడా క్వారంటైన్​కు తరలించాలని అధికారులను ఆదేశించారు.

కరోనా పాజిటివ్​తో అధికార యంత్రాంగం అప్రమత్తం

ఇవీ చూడండి: మోదీ పిలుపులో భాగమవుదాం... దీపాలు వెలిగిద్దాం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.