వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన వినీత్ చంద్రారెడ్డి క్యాట్లో 99.94 పర్సంటైల్ సాధించారు. గతేడాది భోపాల్లో బీటెక్ ఈసిఈ పూర్తి చేశాడు. ప్రస్తుతం గురుగ్రామ్లోని ఈఎక్సెల్ అనే కంపెనీలో బిజినెస్ అనాలసిస్ట్గా పని చేస్తున్నాడు. అయితే గత సంవత్సరం 99.37 పర్సంటైల్ రాగా... ఐఐఎం అహ్మదాబాద్, కోల్కతా, బెంగళూరులోని ఏదైనా ఒక దాంట్లో మేనేజ్మెంట్ కోర్స్ చేయాలన్నది చంద్రారెడ్డి లక్ష్యమని... అందుకే మళ్ళీ పరీక్ష రాశానని తెలిపారు.
ఈసారి సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ చదువు పూర్తయిన తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడతానని వినీత్ తెలిపారు. భవిష్యత్తులో కొంత పెట్టుబడి పెట్టడంతో పాటు సినిమాల నిర్మాణంలో ఖర్చు ఎలా తగ్గించుకోవాలన్నదానిపై సలహాదారుగా పని చేస్తానన్నారు. అదేవిధంగా వరంగల్ ఎన్ఐటీ విద్యార్థులు సమీర్ అహ్మద్ 99.88, రామగిరి సుజిత్ 99.79, పార్థగోస్వామి 99.62 పర్సెంటైల్ సాధించారు.
ఇవీ చూడండి: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు