ETV Bharat / state

తమ భూములను ఆక్రమించారంటూ దళితుల ఆందోళన

ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని తహసీల్దార్​తో కుమ్మక్కై ఓ వ్యక్తి అక్రమంగా ఆక్రమించాడని ఆరోపిస్తూ దళితులు ఆందోళన చేపట్టారు. కోర్టు నోటీసులు పంపించి తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.

author img

By

Published : Jan 31, 2021, 2:45 PM IST

The concern of the Dalits was that their lands were occupied
తమ భూములను ఆక్రమించారని దళితుల ఆందోళన

తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పుర్​లో కొప్పురు-హుజురాబాద్ ప్రధాన రహదారిపై దళితులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. 1983లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను కొప్పురు గ్రామానికి చెందిన కమల్ అనే వ్యక్తి 2009లో తహసీల్దార్​తో కుమ్మక్కై, దొంగ పట్టాలు సృష్టించుకున్నారని మండి పడ్డారు.

ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిపై దళితులకు ఎలాంటి హక్కులు లేవంటూ.. కోర్టు నుంచి నోటీసులు పంపించి సదరు వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన పట్టా పుస్తకాలు తిరిగి ఇప్పించి.. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని దళితులు వేడుకున్నారు.

తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పుర్​లో కొప్పురు-హుజురాబాద్ ప్రధాన రహదారిపై దళితులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. 1983లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను కొప్పురు గ్రామానికి చెందిన కమల్ అనే వ్యక్తి 2009లో తహసీల్దార్​తో కుమ్మక్కై, దొంగ పట్టాలు సృష్టించుకున్నారని మండి పడ్డారు.

ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిపై దళితులకు ఎలాంటి హక్కులు లేవంటూ.. కోర్టు నుంచి నోటీసులు పంపించి సదరు వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన పట్టా పుస్తకాలు తిరిగి ఇప్పించి.. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని దళితులు వేడుకున్నారు.

ఇదీ చూడండి: విషం తాగి హోంగార్డు ఆత్మహత్య.. కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.