అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని అమరవీరుల స్థూపం నుంచి కాళోజీ కూడలి వరకు ఓ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటూ నినాదాలు చేశారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి మహిళ న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ ర్యాలీలో దాదాపు 300 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య