ETV Bharat / state

వరంగల్​ గ్రామీణ జిల్లాను తాకని కరోనా వైరస్

author img

By

Published : Apr 16, 2020, 2:54 PM IST

కరోనా వైరస్​ను కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​తో రోజూవారి కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారిని ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో 300 పేద కుటుంబాలకు పద్మశాలి సంఘం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.

Warangal rural district collector haritha
వరంగల్​ గ్రామీణ జిల్లాను తాకని కరోనా వైరస్

కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ రోజూ కూలీ చేసుకుని బతికే వారి పాలిట శాపమైంది. వీరిని ఆదుకోవడానికి పలు చోట్ల దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి దాతలను అభినందించారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని, ఇక ముందు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్ గుంటి రజని, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర ఓంప్రకాశ్ పాల్గొన్నారు.

కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ రోజూ కూలీ చేసుకుని బతికే వారి పాలిట శాపమైంది. వీరిని ఆదుకోవడానికి పలు చోట్ల దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి దాతలను అభినందించారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని, ఇక ముందు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్ గుంటి రజని, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర ఓంప్రకాశ్ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.