ETV Bharat / state

బావిలో ఇంకెవ్వరి మృతదేహాలు లేవు

author img

By

Published : Oct 28, 2020, 9:52 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో అదుపు తప్పి బావిలో పడిన జీపు ఘటనకు సంబంధించి... రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగాయి. ఈ దుర్ఘటనలో పది మంది సురక్షితంగా బయటపడగా.... జీపు డ్రైవర్ మృతదేహం బయటకు తీశారు. బావిలో మృతదేహాలు లేకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బావిలో ఇంకెవ్వరి మృతదేహాలు లేవు
బావిలో ఇంకెవ్వరి మృతదేహాలు లేవు

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో బావిలో గల్లంతైన వారి కోసం అధికారుల చేపట్టిన గాలింపు చర్యలు ముగిశాయి. బావిలో మరే మృతదేహాలు లభించకపోవండ వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో వరంగల్ నుంచి నెక్కొండకు ప్రయాణీకులతో వెళుతున్న జీపు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. ఘటనలో డ్రైవర్​ మృతి చెందగా... పదిమంది సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదంలో మరెవరైనా జీపులో ఉండొచ్చనే అనుమానంతో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో నీటిని పూర్తిగా తోడేశారు. ఎలాంటి ఆధారాలు గాని... మృతదేహాలు దొరకలేదు.

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో బావిలో గల్లంతైన వారి కోసం అధికారుల చేపట్టిన గాలింపు చర్యలు ముగిశాయి. బావిలో మరే మృతదేహాలు లభించకపోవండ వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో వరంగల్ నుంచి నెక్కొండకు ప్రయాణీకులతో వెళుతున్న జీపు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. ఘటనలో డ్రైవర్​ మృతి చెందగా... పదిమంది సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదంలో మరెవరైనా జీపులో ఉండొచ్చనే అనుమానంతో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో నీటిని పూర్తిగా తోడేశారు. ఎలాంటి ఆధారాలు గాని... మృతదేహాలు దొరకలేదు.

ఇదీ చూడండి: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. డ్రైవర్​ మృతి, మరో ముగ్గురు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.