వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామం సమీపంలో 32 ఏళ్ల గుర్తు తెలియని మహిళను దుండగులు పెట్రోల్ పోసి తగులపెట్టారు. సమాచారం తెలుసుకున్న జోగులాంబ గద్వాల్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి డాగ్ స్వ్కాడ్, క్లూస్ బృదంతో వివరాల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ వివరించారు. హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సృజన పరిశీలించారు.
ఇదీ చూడండి : ప్రేమ కోసం.. తల్లిని చంపి తండ్రిపైనే ఫిర్యాదు