ETV Bharat / state

గొంతుకు తాడు బిగించి హత్య

వికారాబాద్​ జిల్లా చిట్టిగిద్దలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గొంతుకు తాగు బిగించి హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

author img

By

Published : Mar 14, 2019, 9:38 PM IST

యువకుడి దారుణ హత్య
యువకుడి దారుణ హత్య
వికారాబాద్​ జిల్లా నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. చిట్టిగిద్ద గ్రామానికి చెందిన సోహేల్​ హత్యకు గురయ్యారు. బుధవారం వికారాబాద్​ ఆసుపత్రిలో తల్లికి చికిత్స చేయించి, సాయంత్రానికి ఇంటికి చేరాడు. అనంతరం బయటకు వెళ్లి రాత్రి 9 గంటలైనా రాకపోయేసరికి తల్లి ఫోన్ ​చేసింది. 'వచ్చేస్తానుపడుకోమని' చెప్పాడని.. అంతలోనే హత్యకు గురయ్యాడని కన్నీటిపర్యంతమైంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్​ టీం, జాగిలాలతో ఆధారాలు సేకరించారు. మద్యం సీసా, ఆహార పదార్థాలను గుర్తించారు.రెండు రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:బస్సు కిందపడి రెండేళ్ల బాలుడు మృతి

యువకుడి దారుణ హత్య
వికారాబాద్​ జిల్లా నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. చిట్టిగిద్ద గ్రామానికి చెందిన సోహేల్​ హత్యకు గురయ్యారు. బుధవారం వికారాబాద్​ ఆసుపత్రిలో తల్లికి చికిత్స చేయించి, సాయంత్రానికి ఇంటికి చేరాడు. అనంతరం బయటకు వెళ్లి రాత్రి 9 గంటలైనా రాకపోయేసరికి తల్లి ఫోన్ ​చేసింది. 'వచ్చేస్తానుపడుకోమని' చెప్పాడని.. అంతలోనే హత్యకు గురయ్యాడని కన్నీటిపర్యంతమైంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్​ టీం, జాగిలాలతో ఆధారాలు సేకరించారు. మద్యం సీసా, ఆహార పదార్థాలను గుర్తించారు.రెండు రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:బస్సు కిందపడి రెండేళ్ల బాలుడు మృతి

Intro:Tg_mbnr_05_13_Naaradhagadda_bramosthavalu_Pkg_C12
పవిత్రమైన కృష్ణ నది రెండు పాయల వద్ద కలిసిన ఓ లోయలో వెలసిన శ్రీ చెన్న బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు ఐదు రోజుల వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.


Body:నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముస్లాయపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ చెన్న బసవేశ్వర స్వామి ఉత్సవాలను చేరుకోవడానికి భక్తులు నదిలో పుట్టిలో ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున తెలంగాణ,కర్ణాటక ప్రాంతాల భక్తులు వస్తుంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.
స్థానికుల మేరకు స్వామివారి చరిత్ర నారదుడు ప్రతిష్ఠించిన లింగం గనుక నారదగడ్డ గా పిలువబడుతుంది. శాస్త్రీయ అంశరంగా కృష్ణా నది తీరంలో ఉన్న 7 ద్వీపాలలో నారదాగడ్డ కూడా ఒక ద్విపం. శివ పురాణం ప్రకారంగా గా నారదుడు కైలాసానికి వెళ్ళినప్పుడు బసవేశ్వరునికి కాలు తగలడం జరుగుతుంది కాలు తగిలినందుకు ఆగ్రహించుకున్న బసవేశ్వరుడు నారదుడికి త్రిలోక సంచారం తిరిగే అర్హతను లేకుండా శాపాన్ని ఇస్తాడు మూడు లోకాలు సంచరించే వరం వెళ్లి పోయినప్పటికీ దుఃఖితుడై నారదుడు బ్రహ్మను ఆశ్రయిస్తాడు. బ్రహ్మ విష్ణు వుని ఆశ్రయించమని చెపుతాడు. నారదుడు విష్ణువుని ఆశ్రయిస్తే విష్ణువు శివుడిని వేడుకోమంటాడు నారదుడు శివుడిని ఆశ్రయిస్తే ఎవరి దగ్గర అయితే శాపాన్నీ పొందవో వారినే వేడుకోమని శివుడు చెప్తే అపుడు నారదుడు బసవేశ్వరుని స్తుతించి తన తప్పిదాన్ని మన్నించమని వెడుకొనగా బసవేశ్వరుడు ప్రసన్నుడై కృష్ణానది తీరంలో నదిలో కోటుకొచ్చిన లింగాన్ని నారదుడు ప్రతిష్టించి కోటి నామాల శివనామాలు చెప్పి వరం తీసుకో అని బసవేశ్వరుడు చెప్పగా నారదుడికి అప్పుడు శాపవిమోచనం అవుతుందని బసవేశ్వరుడు చెప్పారు. తదనంతరం నారదుడు కృష్ణానది తీరంలో స్నానం చేస్తుండగా నదిలో కొట్టుకొచ్చిన లింగాన్ని ప్రతిష్టించాడు.నారదుడు లింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి నారద గడ్డ గా ఈ ప్రాంతంలో పిలువబడుతుంది.
తెలంగాణ,కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చేపల వేటగాళ్ళు చేపల వేటాడే సమయంలో సాయంత్రం పూట ఒక గొంగడి వేసుకుని ఒక వృద్ధుడు అక్కడకు వచ్చాడు అయితే చేపల వేట వద్ద ఉన్నా ఆ పుట్టిని లాగే వ్యక్తులను నన్ను ఈ నది అవతలి ఒడ్డుకు చేర్పించాలని కోరారని అయితే ఆ పుట్టి నడిపేవారు ఇప్పుడు సమయం రాత్రి అవుతుందని రేపు ఉదయం అక్కడికి చేరూస్తామని అంతవరకు మా ఊరిలోనే ఉండమని ఆ వృద్ధుడికి ప్రబోధించారు. వారు ఇంటికి తిరిగి వెళ్లరు కానీ ఆ వృద్ధుడు తన వద్ద ఉన్న గొంగడి ని నీళ్లపై వేసి పైనుంచి ఒడ్డుకు చేరుకున్నాడు అయితే ఉదయం వేటగాళ్లు ఇక్కడకు వచ్చేసరికి ఆ వృద్ధుడు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని చేపల వేటగాళ్ళు పసిగట్టారు. పవిత్రమైన కృష్ణనది రెండు పాయల వద్ద కలిసిన ఒక లోయలో తల భాగం మాత్రమే కనిపించింది అక్కడకు వెళ్లి ఆ వృద్దుడిని మీరు ఎవరు అని అడిగితే నేను చెన్న బసవేశ్వర స్వామి అని అభివర్ణించారు అని స్థానికులు తెలిపారు.


Conclusion:దాదాపు ఐదు శతాబ్దాల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు అప్పటినుండి ఇప్పటివరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి అని స్థానికులు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి కార్యక్రమాలతోపాటు సేవా కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని నిర్వాహకులు తెలిపారు ఇందులో భాగంగా గా ఇందులో భాగంగా బండిలాగుడు పోటీలను స్థానికులు నిర్వహించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.