సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై ఫాస్టాగ్తో పనిలేకుండా నగదు చెల్లించి వాహనాల రాకపోకలు సాగించవచ్చు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు 218 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారిపై నిత్యం 15 వేలకు పైగా వాహనాలు రాకపోకలను సాగిస్తున్నాయి. సిద్దిపేట సమీపంలోని దుద్దెడ, కరీంనగర్ సమీపంలోని రేణిగుంట, రామగుండం సమీపంలోని బల్వంతపూర్ వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి.
దేశంలోని ప్రధాన రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని సోమవారం అర్ధరాత్రి నుంచి కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జిల్లాకు సమీపంలోని దుద్దెడ టోల్ ప్లాజా రాష్ట్ర రహదారి పరిధిలో ఉన్నందున ఫాస్టాగ్తో పనిలేకుండానే వాహనదారులు నగదు చెల్లించి ప్రయాణించవచ్చని... టోల్ ప్లాజా మేనేజర్ అశోక్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఇంకా ఫాస్టాగ్ సేవలు అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నాగార్జునసాగర్