కాంగ్రెస్, భాజపా నుంచి తెరాసలో చేరిన కార్యకర్తలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా చేరిన కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తెరాస చేస్తున్న అభివృద్ధిని చూసే అందరూ పార్టీలోకి వస్తున్నారని మాణిక్ రావు వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: పండుగలకు ఆ బావి నీళ్లు ఉండాల్సిందే..