రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో 5 కరోనా కేసులు నమోదవ్వడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ ప్రభావిత ప్రాంతాలైన మినార్ కాలనీ, వాదిఏ జుబెల్ కాలనీలను 'కంటైన్మెంట్ క్లస్టర్' ప్రాంతాలుగా ప్రకటించి.. స్థానికులను ఇళ్లకే పరిమితం చేశారు. ఆ ప్రాంతాల్లో సంయుక్త కలెక్టర్ హరీశ్ పర్యటించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులకు కావాల్సిన నిత్యవసర వస్తువులను ఇంటికే చేరేలా ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్తో పాటు కందుకూరు ఆర్డీవో రవీందర్ రెడ్డి, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లా, డిప్యూటీ డీఎంహెచ్ఓ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: 'ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలను పోషించలేకపోతున్నా'