ETV Bharat / state

తుర్కయంజాల్ పీఏసీఎస్ ఛైర్మన్​కు ఎమ్మెల్యే అభినందన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్​ పీఏసీఎస్ ఛైర్మన్​గా గెలుపొందిన సత్తయ్యను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి అభినందించారు. నియోజకవర్గంలో మిగిలిన రెండు స్థానాలను తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Feb 17, 2020, 9:19 AM IST

mla-manchireddy-kishan-reddy-congratulates-turkayamjal-pacs-chairman
తుర్కయంజాల్ పీఏసీఎస్ ఛైర్మన్​కు ఎమ్మెల్యే అభినందన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో తెరాస విజయ దుందుభి మోగించిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి తెలిపారు. తుర్కయంజాల్ పీఏసీఎస్​ ఎన్నికల్లో ఛైర్మన్​గా గెలుపొందిన సత్తయ్యను కలిసి ఆయనను అభినందించారు.

ఆదివారం ఏడు సంఘాల్లో జరిగిన ఛైర్మన్​ నియామకంలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుపొందారని.. ఇవాళ మిగతా రెండు స్థానాల్లో తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సారథ్యంలో అన్ని రంగాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. అందుకే ప్రతి ఎన్నికల ఫలితాలు తమవైపే వస్తున్నాయన్నారు.

తుర్కయంజాల్ పీఏసీఎస్ ఛైర్మన్​కు ఎమ్మెల్యే అభినందన

ఇదీ చదవండిః సినీ నటుడు బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో తెరాస విజయ దుందుభి మోగించిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి తెలిపారు. తుర్కయంజాల్ పీఏసీఎస్​ ఎన్నికల్లో ఛైర్మన్​గా గెలుపొందిన సత్తయ్యను కలిసి ఆయనను అభినందించారు.

ఆదివారం ఏడు సంఘాల్లో జరిగిన ఛైర్మన్​ నియామకంలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుపొందారని.. ఇవాళ మిగతా రెండు స్థానాల్లో తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సారథ్యంలో అన్ని రంగాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. అందుకే ప్రతి ఎన్నికల ఫలితాలు తమవైపే వస్తున్నాయన్నారు.

తుర్కయంజాల్ పీఏసీఎస్ ఛైర్మన్​కు ఎమ్మెల్యే అభినందన

ఇదీ చదవండిః సినీ నటుడు బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.