రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ సర్జిపూల్ నుంచి అనంతగిరి రిజర్వాయర్లోకి ట్రయల్రన్ ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా నిర్మించిన సర్జిపూల్ నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరాం, సలహాదారుడు పెంటారెడ్డి, ఎస్ఈ ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతగిరి పరిధిలోని రైతులు నీటి విడుదలపై హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కరోనా లేదు: ఈటల