తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా సంచార బయో శౌచాలయ వాహనాన్ని రూపొందించారు. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణ పర్యాటక శాఖకు చెందిన బస్సును రూ.7.50 లక్షలకు కొనుగోలు చేసి అందులో రూ.12.50 లక్షలతో పలు సౌకర్యాలు సమకూర్చారు. నాలుగు మరుగుదొడ్లు, చిన్నపిల్లలకు పాలు పట్టేందుకు ఫీడింగ్ గది, గది బయట వేచి ఉండేవారికి రెండు కుర్చీలు, సెల్ఫోన్ ఛార్జింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. బస్సు వెనుక భాగంలో తినుబండారాలు, టీ విక్రయాలకు వీలుగా దుకాణం ఏర్పాటు చేశామని, దీనికి డ్రైవర్, నిర్వాహకుడిని నియమించనున్నామని సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్ కె.సమ్మయ్య తెలిపారు.

ఇదీ చూడండి: నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు