పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే కోరాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు బలవంతంగా ఆందోళన విరమింపజేశారు.
ఇదీ చదవండిః సమస్యలు పరిష్కరించాలంటూ చీఫ్ విప్కు వినతిపత్రం