ETV Bharat / state

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి : సీపీఐ డిమాండ్​ - Peddapalli Ramagundam CPI Dheekshalu

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి వార్తలు సేకరిస్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కరరావు భవన్​లో సీపీఐ రామగుండం నగర సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు.

సీపీఐ దీక్షలు
సీపీఐ దీక్షలు
author img

By

Published : Jun 21, 2020, 8:28 PM IST

ఎమర్జెన్సీ సర్వీసెస్​ ఉద్యోగులకు ప్రకటించిన మాదిరిగానే రూ. 50 లక్షల జీవిత బీమా స్కీమ్​ను జర్నలిస్టులకు సైతం వర్తింపజేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూపెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కరరావు భవన్​లో సీపీఐ రామగుండం నగర సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు.

నిరాహార దీక్షను సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు ప్రారంభించగా... జర్నలిస్టు సంఘాల నాయకులు పిట్టల రాజేందర్, నాగపురి సత్యం, వేల్పుల నారాయణలు సంఘీభావం తెలిపారు. కరోనాతో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.

సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు రమేశ్​ కుమార్, రేణిగుంట్ల ప్రీతం, గడప శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు గొడిశల నరేశ్​, మండల శ్రీనివాస్, జనగామ మల్లేశ్​, ఎలకలపల్లి సురేశ్​, గాజుల అవినాశ్​, మాతంగి సాగర్, అంబాల శ్రీనివాస్, రాజు, సురేశ్​ తదితరులు దీక్షల్లో కూర్చున్నారు.

ఇదీ చూడండీ : కాళేశ్వరం వరప్రదాయినికి సంవత్సరం పూర్తి

ఎమర్జెన్సీ సర్వీసెస్​ ఉద్యోగులకు ప్రకటించిన మాదిరిగానే రూ. 50 లక్షల జీవిత బీమా స్కీమ్​ను జర్నలిస్టులకు సైతం వర్తింపజేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూపెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కరరావు భవన్​లో సీపీఐ రామగుండం నగర సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు.

నిరాహార దీక్షను సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు ప్రారంభించగా... జర్నలిస్టు సంఘాల నాయకులు పిట్టల రాజేందర్, నాగపురి సత్యం, వేల్పుల నారాయణలు సంఘీభావం తెలిపారు. కరోనాతో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.

సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు రమేశ్​ కుమార్, రేణిగుంట్ల ప్రీతం, గడప శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు గొడిశల నరేశ్​, మండల శ్రీనివాస్, జనగామ మల్లేశ్​, ఎలకలపల్లి సురేశ్​, గాజుల అవినాశ్​, మాతంగి సాగర్, అంబాల శ్రీనివాస్, రాజు, సురేశ్​ తదితరులు దీక్షల్లో కూర్చున్నారు.

ఇదీ చూడండీ : కాళేశ్వరం వరప్రదాయినికి సంవత్సరం పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.