నూతన ఈవీఎంల పనితీరుపై శిక్షణ ఇవ్వాలని రైతుల ఆందోళన నిజామాబాద్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నూతన ఈవీఎంలపై అభ్యర్థులకు ఇవాళ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అవగాహన కేంద్రానికి చేరుకున్న రైతు అభ్యర్థులకు... యంత్రాలు ఇంకా రాలేదని, సాయంత్రం 5 గంటలకు వస్తాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాతే శిక్షణ ఇస్తామన్నారు. ఆందోళన చెందిన రైతు అభ్యర్థులు ఈవీఎంలపై తక్షణమే శిక్షణ అందించాలని నిరసన చేపట్టారు. ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్తోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఇవీ చూడండి :'వారి జేబుల నుంచే న్యాయ్ నిధుల సేకరణ'