తాగునీటి కష్టాలను తీర్చాలని స్థానికుల రాస్తారోకో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తాగునీటి కష్టాలను తీర్చాలని స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బోధన్-నాందేడ్ రహదారిపై బిందెలతో బైఠాయించి కమిషనర్ వెంటనే రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 32 వ వార్డులో ఉన్న చేతి పంపు సరిగా పనిచేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ను కాలనీ వాసులు నిలదీశారు. నీటి సమస్య వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. స్పందించిన కమిషనర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.మొత్తం మీద వేసవి ఆరంభంలోనే నీటి సమస్య ఈ స్థాయిలో ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.
ఇవీ చదవండి :'భారత్కు ఇవే ఆఖరి ఎన్నికలు!'