నిజామాబాద్ జిల్లా కేంద్రంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రంలోని బస్టాండు నుంచి బాన్సువాడకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు.. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సిగ్నల్ గమనించక అక్కడే ఆగి ఉన్న మరో ఆర్టీసీ బస్సును క్రాస్ చేస్తూ ముందుకు వెళ్ళింది. ఆగి ఉన్న బస్సుకు వెనక ఉన్న మరో బస్సు తగలడం వల్ల ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బస్సును అక్కడి నుంచి పంపేశారు. ఎలాంటి హానీ జరగకపోవడం వల్ల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్షం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు తెలిపారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఏఎస్సై ఆత్మహత్యాయత్నం... ఎందుకు?