ఫీవర్ సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది బృందానికి థర్మా మీటర్, ఆక్సిమీటర్ అందించి ఇంటింటి సర్వేకు పంపాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్.. ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 16, 24 వ వార్డుల్లో జరుగుతున్న ఫీవర్ సర్వేను ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ రమేష్తో కలిసి పర్యవేక్షించారు. ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కాలనీల్లో పర్యటించి ప్రజలను ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి అవగాహన కల్పించారు. ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, 24 వ వార్డు కౌన్సిలర్ ఆకుల రాము, ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఆయేషా, తెరాస సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పీపీఈ కిట్ లేకుండా వెళ్లడం తప్పు: బండి సంజయ్