ETV Bharat / state

లాక్​డౌన్​లో 1400 కి.మీ వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది...

స్నేహితుడితో కలిసి కొడుకు వేరే రాష్ట్రానికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో... కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ను విధించాయి. అంతే ఆ తల్లి కొడుకును చూసేందుకు తల్లడిల్లిపోయింది. తనను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకుంది. ఇంతకీ కొడుకును తీసుకొచ్చేందుకు ఆమె ఏమి చేసింది? ఇంటికి తీసుకెళ్లిందా? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

author img

By

Published : Apr 9, 2020, 4:35 PM IST

mother-drives-1400-kilometers-for-his-son-at-nizamabad
లాక్​డౌన్​లో వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది...

సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. ఆమె పంచే ప్రేమకు అంతే లేదని ఓ తల్లి మరోసారి రుజువు చేసింది. నిజామాబాద్​ జిల్లా బోధన్​కు చెందిన రజియా బేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్​గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్నవాడైన నిజాముద్దీన్ ఇంటర్​ పూర్తి చేసి హైదరాబాద్​లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవలె బోధన్ వచ్చిన నిజాముద్దీన్... స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాలేదని తెలిసి మార్చి 12న అతనితో నెల్లూరు వెళ్లాడు.

అక్కడ నుంచి మొక్కులు తీర్చుకునేందుకు రహమతాబాద్​ దర్గాకు వెళ్లాడు. ఇదే సమయంలో ప్రభుత్వం లాక్​డౌన్​ విధిచండంతో అక్కడే చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న తల్లి రజియా ఆందోళన చెందింది. కొడుకు ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఏసీపీ జయపాల్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించింది.

ఏసీపీ ఇచ్చిన లెటర్​తో 1400కి.మీ ప్రయాణం

ఏసీపీ ఇచ్చిన లెటర్ తీసుకుని... స్కూటీపై రహమతాబాద్​కు బయలుదేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు స్కూటీపై ప్రయాణాన్ని ప్రారంభించి... మంగళవారం మధ్యాహ్ననికి చేరుకుంది. కుమారుడిని తీసుకుని వెంటనే బయల్దేరింది. మరుసటిరోజు మధ్యాహ్నానికి కామారెడ్డి చేరుకుంది. కన్నకొడుకు కోసం రానూపోనూ దాదాపు 1400 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించింది.

లాక్​డౌన్​లో వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది...

కొడుకును చూడాలనే తపనే తనను అంత దూరం వెళ్లేలా చేసిందని రజియా తెలిపింది. దీనికి సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి: '2020-21లో భారత వృద్ధి రేటు 4.8 శాతమే'

సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. ఆమె పంచే ప్రేమకు అంతే లేదని ఓ తల్లి మరోసారి రుజువు చేసింది. నిజామాబాద్​ జిల్లా బోధన్​కు చెందిన రజియా బేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్​గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్నవాడైన నిజాముద్దీన్ ఇంటర్​ పూర్తి చేసి హైదరాబాద్​లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవలె బోధన్ వచ్చిన నిజాముద్దీన్... స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాలేదని తెలిసి మార్చి 12న అతనితో నెల్లూరు వెళ్లాడు.

అక్కడ నుంచి మొక్కులు తీర్చుకునేందుకు రహమతాబాద్​ దర్గాకు వెళ్లాడు. ఇదే సమయంలో ప్రభుత్వం లాక్​డౌన్​ విధిచండంతో అక్కడే చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న తల్లి రజియా ఆందోళన చెందింది. కొడుకు ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఏసీపీ జయపాల్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించింది.

ఏసీపీ ఇచ్చిన లెటర్​తో 1400కి.మీ ప్రయాణం

ఏసీపీ ఇచ్చిన లెటర్ తీసుకుని... స్కూటీపై రహమతాబాద్​కు బయలుదేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు స్కూటీపై ప్రయాణాన్ని ప్రారంభించి... మంగళవారం మధ్యాహ్ననికి చేరుకుంది. కుమారుడిని తీసుకుని వెంటనే బయల్దేరింది. మరుసటిరోజు మధ్యాహ్నానికి కామారెడ్డి చేరుకుంది. కన్నకొడుకు కోసం రానూపోనూ దాదాపు 1400 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించింది.

లాక్​డౌన్​లో వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది...

కొడుకును చూడాలనే తపనే తనను అంత దూరం వెళ్లేలా చేసిందని రజియా తెలిపింది. దీనికి సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి: '2020-21లో భారత వృద్ధి రేటు 4.8 శాతమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.