ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

లాక్​డౌన్​లో పోలీసులు, వైద్యులతో సమానంగా.. సేవలందించిన వారిలో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యులు. వారి సేవలు వెల కట్టలేనివి. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం వారి సేవలను కొనియాడారు. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టింది.

author img

By

Published : May 15, 2020, 11:28 PM IST

Health Checkups For Sanitation Workers
పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఆరోగ్య పరీక్షా కేంద్రాలను నగర మేయర్​ నీతూ కిరణ్​ సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను అంది పుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్​ కమిషనర్​ జితేష్​ వి.పాటిల్​, ఎంహెచ్​ఓ శ్రీనివాస్​ రెడ్డి, డిప్యూటీ కమిషనర్​ రవిబాబు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఆరోగ్య పరీక్షా కేంద్రాలను నగర మేయర్​ నీతూ కిరణ్​ సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను అంది పుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్​ కమిషనర్​ జితేష్​ వి.పాటిల్​, ఎంహెచ్​ఓ శ్రీనివాస్​ రెడ్డి, డిప్యూటీ కమిషనర్​ రవిబాబు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.