ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. నిజామాబాద్ జిల్లాలోని వార్డు నంబరు 1 ఖానాపూర్, భాగ్యనగర్ కాలనీల్లో దోమతెరలు పంపిణీ చేశారు. మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ట్యాంక్బండ్ నెక్లెస్ రోడ్డు వద్ద "5కే రన్" నిర్వహిస్తునట్లు వెల్టెక్ ఫౌండేషన్ ఛైర్మన్ వీరాచారి చిలుపూరి తెలిపారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ, జిల్లా మహిళా కోఆర్డినేటర్ సరిత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మాస్కుల తయారీతో బిజీగా గడుపుతున్న సిరిసిల్ల మహిళలు