ETV Bharat / state

ఆ ఇంటికెళితే మనసు హరితవర్ణ శోభితమవుతుంది.. ఆహ్లాదంతో ఊగిసలాడుతుంది!

author img

By

Published : Jul 7, 2020, 9:28 PM IST

ఇదేంటి ఇంత పచ్చగా ఉంది...! ఇది ఇల్లా లేకపోతే అడవా..? అని మనం సరదాగా అంటుంటాం..! కానీ ఇక్కడ చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది. ఈ అందమైన అటవీ ప్రాంతం ఎక్కడుంది అనుకుంటున్నారా...! కాకులు దూరని కారడవి... చీమలు దూరని చిట్టడవి అని కవులు వన సౌందర్యాన్ని, దాని తీవ్రతను వర్ణించడం చాలా సందర్భాల్లో చదివే ఉంటారు. కొంతమంది ప్రత్యక్షంగానూ చూసి ఉండొచ్చు. ఇది కూడా కొంచెం అలాంటిదే... కానీ ఇందులోకి కాకులు, చీమలే కాదు ఏకంగా మనుషులు కూడా దూరగలరు. అన్నింటికంటే ప్రధానమైనది... ఇది అడవి కాదు. అరణ్యంలా కనిపిస్తోన్న జనావాసం. అదేనండి... ఇల్లు.

a-whole-house-covered-by-greenery-of-trees-and-plants-in-nizamabad-district
ఆ ఇంటికెళితే మనసు హరితవర్ణ శోభితమవుతుంది.. ఆహ్లాదంతో ఊగిసలాడుతుంది!
ఆ ఇంటి సముదాయం... అంతా 'వన'మయం

ఆ ఇల్లు ఆకుపచ్చని అందాల హరివిల్లు. హరితహారానికి నిలువుటద్దం. రకరకాల మొక్కలు, రంగురంగుల పూలు, నోరూరించే పండ్లతో కూడిన సుందర నందనవనం. అన్నింటికీ మించి అద్భుతమైన సువాసన.. ఆహ్లాదకరమైన వాతావరణం. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఇంటినే హరితవనంగా మార్చుకున్నారు... నిజామాబాద్‌కు చెందిన వెంకటేశ్‌. తక్కువ స్థలంలోనే వివిధ రకాల మొక్కలు నాటి ఇంటిని ప్రకృతిమయం చేశాడు. హరితహారంలో భాగంగా ఇచ్చిన మొక్కలు సైతం ఏపుగా పెరిగి చల్లని నీడనిస్తున్నాయి.

నిజామాబాద్‌ జిల్లా వినాయక్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌కు మొక్కల పెంపకం, వాటి సంరక్షణ అంటే అమితమైన ప్రేమ. వెంకటేష్ తల్లిదండ్రులకు మొక్కలంటే ప్రాణం. మొక్కలనూ పిల్లలతో సమానంగా చూడటం అద్భుతంగా అనిపించేది. అదే అలవాటు... తన ఇంటిని హరితవనంగా మార్చేలా చేసింది. 100 గజాల స్థలంలో 60 గజాల్లోనే ఇల్లు ఉండటంతో ఖాళీ ప్రదేశం వెలితిగా అనిపించింది.

అక్కడ రకరకాల పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం ఉన్న చెట్లలో 15ఏళ్ల వయసున్న వృక్షాల నుంచి 15రోజుల క్రితం నాటిన మొక్కల వరకూ ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడంతో... అవి ఏపుగా పెరిగి మొత్తం ఇంటిని పచ్చని పందిరితో కప్పేశాయి. లోపలికి వెళ్తే తప్ప ఇక్కడ ఇల్లు ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు.

వెంకటేష్, మల్లీశ్వరీ దంపతుల ఇంట్లో పూలు, పండ్లు, ఇతర నీడనిచ్చే చెట్లు, కూరగాయలు పెంచుతున్నారు. 3 రకాల మామిడి, సీతాఫలం, బొప్పాయి, నిమ్మ, జామ వంటి పండ్ల చెట్లు ఉన్నాయి. వెదురు చెట్టునూ పెంచుతున్నారు. 3 రంగుల్లో పూలు లభించే మందారం, తెలుపు, నీలం రంగుల్లో శంఖుపూల చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. 3 రకాల మల్లె మొక్కలున్నాయి. కలకత్తా పాన్‌లో వినియోగించే తమలపాకు చెట్టు కూడా ఉంది.

హరితహారంలో భాగంగా 2016లో నాటిన వేప, కానుగ వంటివి.. ఏపుగా పెరిగి చల్లని నీడనిస్తున్నాయి. ఇంటి గేటు దగ్గర నాటిన రాత్రి-పగలు పూసే నైట్ క్వీన్, డే క్వీన్‌ పూలు.. సువాసన వెదజల్లుతాయి. ఇక మే నెలలో మాత్రమే పూసే మే-ఫ్లవర్‌తో ఈ ఇల్లు ప్రత్యేకత సంతరించుకుంది.

కరివేపాకు, చామగడ్డ, పుంటి కూర, తోటకూర, పాలకూర వంటివి ఇంట్లోనే సాగు చేసుకుంటున్నారు వెంకటేశ్‌ దంపతులు. రోజూ ఉదయం, సాయంత్రం నీళ్లు పట్టడంతోపాటు సేంద్రియ ఎరువులు వేస్తారు. ఎండాకాలంలో చల్లటి వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆదివారాలైతే పూర్తిగా వనాల మధ్యే గడిపి అక్కడే భోజనం చేయడం, చదువుకోవడం, కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు కుటుంబసభ్యులు.

బంధువులు వచ్చారంటే తొలుత మొక్కలతో సెల్ఫీలు దిగేందుకే ఆసక్తి చూపుతారు. వాటి గురించి తెలుసుకుంటూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఇంటిని నందనవనంలా మార్చిన వెంకటేష్ కుటుంబం హరితహారానికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి : ఆ చెట్టుతో అమితాబ్​కు 43 ఏళ్ల అనుబంధం

ఆ ఇంటి సముదాయం... అంతా 'వన'మయం

ఆ ఇల్లు ఆకుపచ్చని అందాల హరివిల్లు. హరితహారానికి నిలువుటద్దం. రకరకాల మొక్కలు, రంగురంగుల పూలు, నోరూరించే పండ్లతో కూడిన సుందర నందనవనం. అన్నింటికీ మించి అద్భుతమైన సువాసన.. ఆహ్లాదకరమైన వాతావరణం. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఇంటినే హరితవనంగా మార్చుకున్నారు... నిజామాబాద్‌కు చెందిన వెంకటేశ్‌. తక్కువ స్థలంలోనే వివిధ రకాల మొక్కలు నాటి ఇంటిని ప్రకృతిమయం చేశాడు. హరితహారంలో భాగంగా ఇచ్చిన మొక్కలు సైతం ఏపుగా పెరిగి చల్లని నీడనిస్తున్నాయి.

నిజామాబాద్‌ జిల్లా వినాయక్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌కు మొక్కల పెంపకం, వాటి సంరక్షణ అంటే అమితమైన ప్రేమ. వెంకటేష్ తల్లిదండ్రులకు మొక్కలంటే ప్రాణం. మొక్కలనూ పిల్లలతో సమానంగా చూడటం అద్భుతంగా అనిపించేది. అదే అలవాటు... తన ఇంటిని హరితవనంగా మార్చేలా చేసింది. 100 గజాల స్థలంలో 60 గజాల్లోనే ఇల్లు ఉండటంతో ఖాళీ ప్రదేశం వెలితిగా అనిపించింది.

అక్కడ రకరకాల పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం ఉన్న చెట్లలో 15ఏళ్ల వయసున్న వృక్షాల నుంచి 15రోజుల క్రితం నాటిన మొక్కల వరకూ ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడంతో... అవి ఏపుగా పెరిగి మొత్తం ఇంటిని పచ్చని పందిరితో కప్పేశాయి. లోపలికి వెళ్తే తప్ప ఇక్కడ ఇల్లు ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు.

వెంకటేష్, మల్లీశ్వరీ దంపతుల ఇంట్లో పూలు, పండ్లు, ఇతర నీడనిచ్చే చెట్లు, కూరగాయలు పెంచుతున్నారు. 3 రకాల మామిడి, సీతాఫలం, బొప్పాయి, నిమ్మ, జామ వంటి పండ్ల చెట్లు ఉన్నాయి. వెదురు చెట్టునూ పెంచుతున్నారు. 3 రంగుల్లో పూలు లభించే మందారం, తెలుపు, నీలం రంగుల్లో శంఖుపూల చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. 3 రకాల మల్లె మొక్కలున్నాయి. కలకత్తా పాన్‌లో వినియోగించే తమలపాకు చెట్టు కూడా ఉంది.

హరితహారంలో భాగంగా 2016లో నాటిన వేప, కానుగ వంటివి.. ఏపుగా పెరిగి చల్లని నీడనిస్తున్నాయి. ఇంటి గేటు దగ్గర నాటిన రాత్రి-పగలు పూసే నైట్ క్వీన్, డే క్వీన్‌ పూలు.. సువాసన వెదజల్లుతాయి. ఇక మే నెలలో మాత్రమే పూసే మే-ఫ్లవర్‌తో ఈ ఇల్లు ప్రత్యేకత సంతరించుకుంది.

కరివేపాకు, చామగడ్డ, పుంటి కూర, తోటకూర, పాలకూర వంటివి ఇంట్లోనే సాగు చేసుకుంటున్నారు వెంకటేశ్‌ దంపతులు. రోజూ ఉదయం, సాయంత్రం నీళ్లు పట్టడంతోపాటు సేంద్రియ ఎరువులు వేస్తారు. ఎండాకాలంలో చల్లటి వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆదివారాలైతే పూర్తిగా వనాల మధ్యే గడిపి అక్కడే భోజనం చేయడం, చదువుకోవడం, కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు కుటుంబసభ్యులు.

బంధువులు వచ్చారంటే తొలుత మొక్కలతో సెల్ఫీలు దిగేందుకే ఆసక్తి చూపుతారు. వాటి గురించి తెలుసుకుంటూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఇంటిని నందనవనంలా మార్చిన వెంకటేష్ కుటుంబం హరితహారానికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి : ఆ చెట్టుతో అమితాబ్​కు 43 ఏళ్ల అనుబంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.