ETV Bharat / state

బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి

author img

By

Published : Jun 25, 2020, 2:24 PM IST

నిర్మల్​ పట్టణ శివారులో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TSRTC BUS, Bike Accident at Nirmal
ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీ

నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి భైంసా పట్టణానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును దిలావర్​పూర్ నుంచి నిర్మల్​కు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నిర్మల్ ఆర్టీసీ డీఎం ఆంజనేయులు పరిశీలించారు.

నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి భైంసా పట్టణానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును దిలావర్​పూర్ నుంచి నిర్మల్​కు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నిర్మల్ ఆర్టీసీ డీఎం ఆంజనేయులు పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.