నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా... కుభీర్ మండల కేంద్రంలో లాక్డౌన్ పాటిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు చేసిన తీర్మానం మేరకు పట్టణంలో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేశారు. ఈరోజు ఉండాల్సిన సంతను సైతం రైతులు నిర్వహించలేదు.
ఉదయం నుంచే పట్టణంలో వ్యాపారస్థులంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. శుక్రవారం నుంచి కొన్ని రోజుల వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరిచి... ఆ తర్వాత బంద్ కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.