ETV Bharat / state

నాగార్జున సాగర్​కు వరద... రైతుల్లో ఆశలు

author img

By

Published : Aug 9, 2019, 3:23 PM IST

ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్​కు వరద ప్రారంభమైంది. దీనితో సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వర్షాలు లేక బోరు, బావులను నమ్ముకొని అలసిపోయామని అన్నదాతలు నిట్టూర్చారు. సాగర్​ ఎడమ కాలువ నీటిని అధికారులు సకాలంలో విడుదల చేస్తే రెండు పంటలు సాగు చేసుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు.

నాగార్జున సాగర్​కు వరద
నాగార్జున సాగర్​కు వరద

మొన్నటివరకు వర్షాభావ పరిస్థితులతో రైతులు కొట్టుమిట్టాడుతూ వ్యవసాయ సాగుకు సన్నద్ధం కాలేక ఇబ్బందులు పడ్డారు. అయితే కృష్ణా ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటం వల్ల ఎగువన ఉన్న జలాశయాలు నిండాయి. ఇప్పుడిప్పుడే నాగార్జున సాగర్​కు వరద మొదలైంది. దీనితో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగంలో సంతోషం నెలకొంది. సాగర్ ఎడమ కాలువ వస్తదని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు త్వరలో నీరు విడుదలకు ప్రణాళికలు తయారు చేయాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో నీరు విడుదల చేయడం వల్ల వరి నారుమళ్లు పెంచుకోవడానికి అవకాశం ఉందంటున్నారు.

వర్షాలు లేనప్పుడు బోర్లు, బావులు ఆధారంగా సాగుచేయడం కష్టంగా ఉండేదని రైతులు తెలిపారు. బోరుబావులతో గంట, రెండు గంటల కన్నా ఎక్కువ నీరు పొలాలకు చేరేది కాదని పేర్కొన్నారు. భూగర్భ జలాలు లేక బోర్లు, బావులు తీయించి అలసిపోయామన్నారు. ఆగస్టులోనే నాగార్జున సాగర్​ నిండేదని.. కృష్ణమ్మ వరద ప్రబావంతో ఈ సారి రెండు పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. సాగర్​ ఎడమ కాలువ వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని రైతులు తెలిపారు.

ఇవీ చూడండి : పొలం పనులకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు

నాగార్జున సాగర్​కు వరద

మొన్నటివరకు వర్షాభావ పరిస్థితులతో రైతులు కొట్టుమిట్టాడుతూ వ్యవసాయ సాగుకు సన్నద్ధం కాలేక ఇబ్బందులు పడ్డారు. అయితే కృష్ణా ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటం వల్ల ఎగువన ఉన్న జలాశయాలు నిండాయి. ఇప్పుడిప్పుడే నాగార్జున సాగర్​కు వరద మొదలైంది. దీనితో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగంలో సంతోషం నెలకొంది. సాగర్ ఎడమ కాలువ వస్తదని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు త్వరలో నీరు విడుదలకు ప్రణాళికలు తయారు చేయాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో నీరు విడుదల చేయడం వల్ల వరి నారుమళ్లు పెంచుకోవడానికి అవకాశం ఉందంటున్నారు.

వర్షాలు లేనప్పుడు బోర్లు, బావులు ఆధారంగా సాగుచేయడం కష్టంగా ఉండేదని రైతులు తెలిపారు. బోరుబావులతో గంట, రెండు గంటల కన్నా ఎక్కువ నీరు పొలాలకు చేరేది కాదని పేర్కొన్నారు. భూగర్భ జలాలు లేక బోర్లు, బావులు తీయించి అలసిపోయామన్నారు. ఆగస్టులోనే నాగార్జున సాగర్​ నిండేదని.. కృష్ణమ్మ వరద ప్రబావంతో ఈ సారి రెండు పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. సాగర్​ ఎడమ కాలువ వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని రైతులు తెలిపారు.

ఇవీ చూడండి : పొలం పనులకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు

Intro:TG_NLG_51_9_SAGAR_ AAYKATTU_RITULA_ASHALU_PKG_TS10064
ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పొంగి పొర్లుతూ జలాశయాలు అని నిండుకుండను తలపిస్తున్న సాగర్ ఆయకట్టు రైతులు ఆశలు చిగురిస్తాయి గత రెండు 2 పంటల కాలంలో వారబందీ విధానంలో లో సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన అధికారులు లు సాగర్ జలాశయం కు నీటి ప్రవాహం రావడంతో సాగర్ ఆయకట్టు కింద రైతులు దుక్కులు దున్ని వరి నారుమళ్లు పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు రు



Body:అసలే వర్షాభావ పరిస్థితులతో రైతులు కొట్టుమిట్టాడుతూ వ్యవసాయ సాగుకు సన్నద్ధం కాలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కృష్ణ ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న డంతో ఎగువన ఉన్న జలాశయాల ని నిండి ఆ వరద ప్రభావం నాగార్జునసాగర్కు మొదలు కావడంతో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగం లో సంతోషం నెలకొంది సాగర్ ఎడమ కాలువ రానప్పటికీ బోర్లు బావులు ఆధారాలు ఉన్నవారు ఇప్పటికే నారుమళ్లు సాగుచేసి అతి కష్టం మీద అ వరి నాట్లకు సిద్ధమవుతున్నారు వర్షాలు లేక పోవడం వలన భూగర్భ జలాలు కూడా అడుగంటాయి బోరుబావులు కూడా గంట రెండు గంటల కన్నా ఎక్కువ నీరు పోవడం లేదని దీనితో సాగు చేయడం చాలా కష్టంగా ఉందని సాగర్ ఎడమ కాలువ వస్తుందని ఆశిస్తున్నామని రైతులు ఆశాజనకంగా ఉన్నారు ఇరిగేషన్ అధికారులు త్వరలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కు నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు తయారు చేసి ఇ రైతులకు కు సకాలంలో తెలియడం వల్ల వరి నారుమళ్లు పెంచుకోవడానికి అవకాశం ఉందంటున్నారు.
బైట్: మధు.రైతు
బైట్: ఉపేందర్ రెడ్డి.రైతు


Conclusion:గత ఏడాది కన్నా ఈ సంవత్సరం వర్షాలు అధికంగా లేకపోయినప్పటికీ బోర్లు బావులు తీయించి అలసిపోయా మని భూగర్భ జలాలు లేకపోవడంతో బోరుబావులు కూడా సరిగా చేయడం లేదని ఆగస్టు మాసం లోనే నాగార్జున సాగర్ నిండుతుంది ఆ విధంగానే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ వరద ప్రభావం ఉండడంవల్ల ఈసారి రెండు పంటలకు సాగునీరు వస్తుందని రైతులు అందరు ఆశాభావం గా ఉన్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉన్న వ్యవసాయాన్ని బోరు బావుల ద్వారా సాగు చేయడం చాలా కష్టంగా మారిందని సాగర్ ఎడమ కాలువ వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని రైతులు అంటున్నారు.
బైట్: మల్లయ్య, రైతు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.