నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జెన్కో కార్యాలయం వద్ద జెన్ కో ఇంజినీర్లు నిరసన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ జెన్కో నుంచి రిలీవ్ అయిన 655 మంది ఇంజినీర్లు తెలంగాణలో చేరడం వల్ల ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసిన 655 మందిని వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణకు వస్తే దశాబ్ద కాలంపాటు రాష్ట్ర యవతకు ఉపాధి ఉండదని జెన్కో ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. వారిని రానివ్వబోమని తిరిగి పంపించేరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు