ETV Bharat / state

ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలి: చెరుకు సుధాకర్​

నల్లొండ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడం సరికాదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ గట్టుప్పల్​ గ్రామంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

author img

By

Published : Jan 24, 2021, 6:01 PM IST

cheruku sudhakar was organized an all-party meeting seeking revocation of pharma company licenses
ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలి: చెరుకు సుధాకర్​

గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరకని మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఫార్మా కంపెనీ పెట్టడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం సరికాదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా పుట్టపాక గ్రామ శివారులో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని చండూర్ మండలం గట్టుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ శివారులో కాంతి లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్​ను ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

మునుగోడు నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతినివ్వడం దారుణమని తెలంగాణ ఇంటి పార్టీ నల్గొండ జిల్లా అధికార ప్రతినిధి బైరి వెంకన్న అన్నారు. 15రోజుల్లోగా అనుమతులు రద్దు చేయకపోతే భారీ ఎత్తున ధర్నా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ మండల సాధన సమితి అధ్యక్షుడు ఇడెం కైలాసం తదితరులు పాల్గొన్నారు.

గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరకని మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఫార్మా కంపెనీ పెట్టడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం సరికాదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా పుట్టపాక గ్రామ శివారులో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని చండూర్ మండలం గట్టుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ శివారులో కాంతి లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్​ను ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

మునుగోడు నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతినివ్వడం దారుణమని తెలంగాణ ఇంటి పార్టీ నల్గొండ జిల్లా అధికార ప్రతినిధి బైరి వెంకన్న అన్నారు. 15రోజుల్లోగా అనుమతులు రద్దు చేయకపోతే భారీ ఎత్తున ధర్నా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ మండల సాధన సమితి అధ్యక్షుడు ఇడెం కైలాసం తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సూరత్​లో తెలంగాణ అధికారుల మృతి.. మంత్రి సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.